Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మప్రచారానికి వారధిగా శుభప్రదం బోధకులు నిలవాలి : తితిదే ఈఓ సాంబశివరావు

Webdunia
శనివారం, 7 మే 2016 (16:51 IST)
సనాతన ధర్మప్రచారానికి వారధులుగా శుభప్రదం బోధకులు నిలవాలని తితిదే ఈఓ సాంబశివరావు పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్వేత భవనంలో శనివారం శుభప్రదం బోధకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శుభప్రదంలో శిక్షణ పొందిన బోధకులు తమ జిల్లాలోని శుభప్రదంలో పాల్గొనే ఇతర అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. బోధకులు పాఠ్యాంశాలను సరళమైన పద్ధతిలో బోధించి ఎక్కువమంది విద్యార్థులు స్ఫూర్తి పొంది, మార్గదర్శకంగా నిలిచేలా తీర్చిదిద్దాలని సూచించారు.
 
అధ్యాపకులు, పాఠ్యాంశాలు సరళమైన పద్ధతులతో బోధించాలని అందుకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. శుభప్రదంలోని బోధన అంశాలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా ప్రసారం చేయడం ద్వారా లక్షలాది మంది ప్రజలు తెలుసుకుంటారని ఈఓ తెలిపారు. శుభప్రదం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 60 కేంద్రాల్లో 23 వేల మంది 8,9,10 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు మే 22 నుంచి 29వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

Navgraha Shanti Bracelet: నెగటివ్ ఎనర్జీ వద్దే వద్దు... నవగ్రహ శాంతి బ్రాస్లెట్‌ను ధరించండి

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

తర్వాతి కథనం
Show comments