Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేతల కంబధ హస్తాల్లో శ్రీవారి ఆలయం : రమణ దీక్షితులు

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు.

Webdunia
బుధవారం, 16 మే 2018 (15:19 IST)
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాజకీయ నాయకులే భ్రష్టుపట్టిస్తున్నారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఓ వ్యాపారంగా మార్చుతున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. చెన్నై పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
1996లో శ్రీవారి ఆలయంలో వంశ పారంపర్యం అర్చకత్వాన్ని ప్రభుత్వం ఉన్నపళంగా రద్దు చేసిందని, అందుకు గల కారణాలు తెలియవన్నారు. వంశపారంపర్య అర్ఛకత్వాన్ని రద్దు చేసిన ప్రభుత్వం అందుకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అదేసమయంలో అధికారులు కూడా స్వామి వారి కైంకర్యాల్లో తలదూర్చుతున్నారని, ఈ విషయమై అర్చకులను బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న తనకే స్వామి వారి ఆభరణాల వివరాలు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు, శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఇచ్చిణ ఆభరణాలు ఎక్కడున్నాయని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. రాజకీయ నాయకుల కబంధహస్తాల నుంచి శ్రీవారి ఆలయాన్ని కాపాడుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments