Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల బ్రహ్మోత్సవాలు : భక్తులకు అనుమతి ఉందా? లేదా? : వైవీ ఏమన్నారు?

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (13:34 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెలలో జరుగనున్నాయి. ఇవి అక్టోబ‌రు 7వ తేదీ నుంచి అదే నెల 15వ తేదీ వరకు వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు. అయితే, ఈ బ్రహ్మోత్సవాలను గత యేడాది తరహాలోనే ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మాట్లాడుతూ, తిరుమ‌ల తిరుప‌తిలో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా జ‌రుపుతామ‌న్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు కరోనా థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. థర్డ్‌ వేవ్‌పై రకరకాల అంచనాలున్నాయన్నారు. 
 
ముఖ్యంగా, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ యేడాది కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతమగానే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది కూడా బ్ర‌హ్మోత్స‌వాలు ఆల‌యానికే ప‌రిమితమ‌వుతాయ‌ని చెప్పారు. వాహ‌న సేవ‌ల‌న్నీ ఆల‌య‌ప్రాకారానికి ప‌రిమితమ‌వుతాయ‌ని వివ‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

14-09-2024 శనివారం దినఫలితాలు : అభిమానించే వ్యక్తులే మిమ్ములను మోసగిస్తారు....

బుధాదిత్య యోగం.. కన్యారాశిలోకి సూర్యుడు.. ఈ ఐదు రాశులకు లాభం

13-09-2024 శుక్రవారం దినఫలితాలు : మానసికంగా కుదుటపడతారు...

12-09-2024 గురువారం దినఫలితాలు - సకాలంలో పనులు పూర్తి చేస్తారు....

గురువారం పసుపు రంగు దుస్తులు... సాయిబాబాకు పాల పదార్థాలు?

తర్వాతి కథనం
Show comments