తిరుమల వెంకన్న కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్‌ దెబ్బ

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్ సోకింది. రెండ్రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థను స్తంభింపజేసిన ఈ వైరస్... ఇపుడు తితిదేను తాకింది. సుమారు

Webdunia
బుధవారం, 17 మే 2017 (12:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కంప్యూటర్లకు వాన్నక్రై వైరస్ సోకింది. రెండ్రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్‌ వ్యవస్థను స్తంభింపజేసిన ఈ వైరస్... ఇపుడు తితిదేను తాకింది. సుమారు 20 కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. అయితే, భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదు.
 
కంప్యూటర్లలోని కేవలం పరిపాలనా పరమైన కొన్ని అంశాలకు వైరస్‌ సోకడాన్ని సిబ్బంది గుర్తించారు. వాస్తవానికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను తితిదే వినియోగిస్తున్నప్పటికీ.. కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తితిదే ఐటీ విబాగం అధికారులు వైరస్‌ సోకిన కంప్యూటర్లను తొలగించారు. ఇతర వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి

Pemmasani Chandrasekhar: ఎంపీల పనితీరుపై సర్వే.. 8.9 స్కోరుతో అగ్రస్థానంలో పెమ్మసాని

భారత్ ఫ్యూచర్ సిటీలో 13 లక్షల ఉపాధి అవకాశాలు.. శ్రీధర్ బాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

06-12-2025 శనివారం ఫలితాలు- రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

శనివారం ఆంజనేయ పూజ.. అరటిపండ్లు, సింధూరం, నువ్వుల నూనె.. ఈ మంత్రం..

05-12-2025 శుక్రవారం ఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

కలలో ప్రియురాలు నవ్వుతూ మీ వెనుకే నడుస్తున్నట్లు కనిపిస్తే...?!!

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

తర్వాతి కథనం
Show comments