Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

సెల్వి
శుక్రవారం, 3 అక్టోబరు 2025 (16:06 IST)
Tirupati
కలియుగ వైకుంఠం తిరుమల కొండపై అక్టోబర్ 1 వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రూ.25 కోట్లకు పైగా కానుకలు సమర్పించారని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ కానుకలను భక్తులు హుండీలో వేసినట్లు చైర్మన్ తెలిపారు. 
 
ఈ ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాలలో (అక్టోబర్ 1 వరకు) 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం రూ.25.12 కోట్లుగా ఉంది అని బీఆర్ నాయుడు అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల మహోత్సవం ద్వారా.. 26 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం  వడ్డించగా, 2.4 లక్షలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 
 
28 రాష్ట్రాల నుండి 298 బృందాలు బ్రహ్మోత్సవాలలో 6,976 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని బీఆర్ నాయుడు చెప్పారు. ఇంకా, బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని అలంకరించడానికి 60 టన్నుల పువ్వులు, నాలుగు లక్షల కట్ పువ్వులు, 90,000 సీజనల్ పువ్వులను ఉపయోగించారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ, కర్ణాటక ఐటీ మంత్రుల మాటల యుద్ధం.. నారా లోకేష్ వర్సెస్ ఖర్గే కౌంటర్లు

స్వీట్ బేబీ డాటర్ డాల్.. నాతో ఒక రాత్రి గడుపుతావా?

విద్యార్థిని ప్రాణం తీసిన పెద్దనాన్న లైంగిక వేధింపులు

తెలంగాణకి రేవంత్ రెడ్డి ఇంకోసారి సీఎం కాలేడు: పగబట్టిన ప్రశాంత్ కిషోర్ (video)

Devaragattu: మల్లేశ్వర స్వామిలో కర్రలతో ఘర్షణ.. ఇద్దరు వ్యక్తులు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

Bathukamma: తెలంగాణలో పూల బతుకమ్మతో ముగిసిన బతుకమ్మ పండుగ

Daily Horoscope: 30-09-2025 మంగళవారం ఫలితాలు- మిమ్ముల్ని తక్కువ అంచనా వేసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments