Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గంగమ్మకు పొంగళ్లతో మొక్కులు

Webdunia
సోమవారం, 16 మే 2016 (12:09 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర కొనసాగుతోంది. జాతరలో భాగంగా భక్తులు గంగమ్మకు పొంగళ్లతో నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. గత ఆరు రోజులుగా వివిధ వేషధారణలతో మొక్కులు తీర్చుకోగా రేపు (మంగళవారం) ప్రధాన జాతర జరుగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రేపు తిరుపతికి చేరుకోనున్నారు. భక్తుల కోసం తిరుపతి గంగమ్మ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
 
ఆలయ ఆవరణలోనే పొంగళ్లు పెడుతూ గంగమ్మను సేవిస్తున్నారు. ఆలయంలో పొంగళ్ల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను కూడా ఏర్పాటు చేయడంతో ఎలాంటి తోపులాటలు లేకుండా గంగమ్మను మొక్కుతున్నారు భక్తులు. నిన్నటి నుంచే గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. 
 
సోమవారం ఉదయం సున్నపు కుండల వేషంలో భక్తులు గంగమ్మను దర్శించుకుంటున్నారు. ఇద్దరు కైకాల కులస్తులు సున్నపు కుండల వేషాన్ని మొదటగా ధరిస్తారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మకు ప్రతీకలుగా ఈ వేషాన్ని వేస్తారు. వీరు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి హారతులను స్వీకరిస్తున్నారు. 18వ తేదీ ప్రధాన ఘట్టం విశ్వరూప దర్శనం జరుగనుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments