Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు : ఈవో ధర్మారెడ్డి

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (16:01 IST)
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ యేడాది సెప్టెంబరు 27వ తేదీ నుంచి జరుగనున్నాయి. 27న ధ్వజారోహణంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తితిదే ఈవో ధర్మ ధర్మారెడ్డి తెలిపారు. 
 
ఆయన శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ యేడాది యధావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న గరుడసేవ, 2న బంగారు రథం, 4న మహారథం 5న, చక్రస్నానం వేడుకలను నిర్వహిస్తామన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments