Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 29 నుంచి తూగోలో ధర్మరథ యాత్ర, శ్రీనివాస కళ్యాణాలు

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (20:10 IST)
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ ధర్మప్రచార పరిషత్ నవంబర్ 29 నుంచి  తూర్పుగోదావరి జిల్లాలో ధర్మరథయాత్ర నిర్వహించనున్నట్లు టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తెలిపారు. ఈ యాత్ర ఒక నెల రోజుల పాటు జరుగనుందని ఆయన వివరించారు. ఈ విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
 
ఈ సందర్భంగా జేఈవో భాస్కర్ మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని మారుమూల ప్రాంతంలో ప్రచారం చేయడానికి ఈ రథ యాత్ర ఏర్పాటు చేసినట్టు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాకు రథాన్ని తిరుపతి నుంచి ఈ నెల 26న పంపనున్నట్లు వివరించారు. రథం గోకవరం చేరుకుంటుందని 29నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రముఖ ప్రాంతాలన్నింటిలో ఈ రథయాత్ర జరుగుతుందన్నారు. తుని లో డిసెంబర్ 7న పిఠాపురంలో డిసెంబర్ 9న,రావుల పాలెంలో డిసెంబర్ 17న రాజనగరంలో డిసెంబర్ 26న యాత్ర జరుగుతుందన్నారు. 
 
రథయాత్ర కాకుండా శ్రీనివాస కళ్యాణాలు జరుగుతాయన్నారు. రంపచౌడవరం డిసెంబర్ 3న, అమలాపురంలో ఈ నెల 18న రాజముంద్రలో 29న కళ్యాణాలు జరుగుతాయని చెప్పారు. ధర్మప్రచారం ప్రతీ గ్రామంలో జరుగుతుందన్నారు. పద్మావతీ అమ్మవారి పసుపుకుంకుమలను మహిళలకు పంపిణీ చేస్తారని చెప్పారు. రథయాత్ర వెంట భజన బృందాలు ఉంటాయని చెప్పారు. ఆ ప్రాంతాలకు చెందిన భజన బృందాలు, కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments