Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

సెల్వి
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (11:59 IST)
తిరుపతి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల, కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం. ఈ ఆలయానికి, ప్రపంచంలోని వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని భారీ సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు వేచి వుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, భక్తుల ఆకలి తీర్చేందుకు ఉచిత భోజనం వంటి వసతులు వున్నాయి. 
 
అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ మొక్కులు తీరాక ఆలయంలోని హుండీలో భారీగా కానుకలు, డబ్బు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం జనవరి నెలలో 20.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా 106 కోట్ల 17 లక్షల రూపాయలు శ్రీవారికి హుండీ ఆదాయంగా వచ్చింది. ఈ ఆదాయంతో ఆలయ చరిత్రలోనే శ్రీవారి హుండీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. తద్వారా వరుసగా వంద కోట్లకు పైగా హుండీ ఆదాయం సంపాదించిన 35వ మాసంగా జనవరి నిలిచింది. మార్చి 2022 నుంచి వరుసగా వందకోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతుందని టీటీడీ వెల్లడించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

ఢిల్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి...? బీజేపీదే హవా-ఆప్‌కే గెలుపంటున్న కేకే సర్వే!

అన్నీ చూడండి

లేటెస్ట్

05-02- 2025 బుధవారం దినఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

Bhishma Ashtami 2025: శ్రీకృష్ణుడిపై భక్తి.. అంపశయ్యపై దాదాపు 58 రోజులు

05th February 2025: భీష్మాష్టమి, బుధాష్టమి.. దీపారాధనకు తామరవత్తులు.. ఇవి చేస్తే?

దుర్గామాత అనుగ్రహం కోసం అఖండ దీపం వెలిగిస్తే..?

04-02- 2025 మంగళవారం దినఫలితాలు : రుణసమస్యలు కొలిక్కివస్తాయి...

తర్వాతి కథనం
Show comments