Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్వ దర్శనానికి మోక్షమెప్పుడో... గత 79 రోజులుగా దర్శనభాగ్యం కరువాయే..

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (11:16 IST)
కలియుగ వైకుంఠుడై శ్రీవేంకటేశ్వర స్వామిని సామాన్య భక్తులు దర్శనం చేసుకునే వెసులుబాటు ఎప్పటికి లభిస్తుందోనన్న బెంగ చాలా మంది భక్తుల్లో నెలకొంది. కరోనా వైరస్, కరోనా లాక్డౌన్ కారణంగా గత 79 రోజులుగా సర్వదర్శనాన్ని నిలిపివేశారు. 
 
కరోనా రెండో దశ విజృంభణ కారణంగా ఏప్రిల్ 12 నుంచి సర్వదర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. ఇప్పటివరకు వాటిని పునరుద్ధరించకపోవడంతో పేదలు, సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.
 
మరోవైపు, ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ తగ్గించింది. మే నెలలో రోజుకు 15 వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ కరోనా వైరస్ భయంతో చాలా మంది తిరుమల రాలేకపోయారు. దీంతో జూన్ నెలలో రోజుకు ఐదు వేల టికెట్లను మాత్రమే జారీ చేసింది. 
 
జులైలోనూ అదే సంఖ్యలో టికెట్లను జారీ చేస్తోంది. ఫలితంగా నేరుగా తిరుమల వచ్చే భక్తులు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు పొందేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి 79 రోజులుగా సర్వదర్శనం నిలిచిపోవడంతో టికెట్ల కోటాను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

జిమ్‌లో వర్కౌట్ చేస్తుంటే గాయపడిన కేటీఆర్!!

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

తర్వాతి కథనం
Show comments