Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... శ్రీవారి సేవలో సచిన్ - చిరంజీవి - నాగార్జున

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత 15 రోజులకుపైగా రద్దీ కొనసాగుతుండగా ప్రస్తుతం మాత్రం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంట్లోనే శ్ర

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (10:39 IST)
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. గత 15 రోజులకుపైగా రద్దీ కొనసాగుతుండగా ప్రస్తుతం మాత్రం తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయానికి సర్వదర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి 6 గంట్లోనే శ్రీవారి దర్శన భాగ్యం లభిస్తోంది. అలాగే కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది. గదులు సులువుగానే లభిస్తున్నాయి. తలనీలాలను గంటలోపే స్వామివారికి భక్తులు కళ్యాణకట్టలలో సమర్పిస్తున్నారు. మంగళవారం శ్రీవారిని 84,746 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 72 లక్షల రూపాయలు లభించింది. 
 
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సినీనటుడు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు అర్చన సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని రంగనాయకమండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సచిన్‌తో పాటు సినీనటులకు కరచాలనం చేసేందుకు భక్తులు ఎగబడ్డారు. సచిన్‌ నవ్వుతూనే ఆలయం నుంచి బయటకు వచ్చారు. అందరికీ రెండు చేతులతో నమస్కారం చేశారు సచిన్‌. కాగా, ఈ ప్రముఖులంతా మంగళవారం రాత్రి చార్టెడ్‌ విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cab Driver: కారులోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. సాయం చేసిన క్యాబ్ డ్రైవర్

నిశ్చితార్థంలో చెంపదెబ్బ.. అయినా రూ.12లక్షలతో పెళ్లి ఏర్పాటు.. ఎన్నారై వరుడి మాయం!

కొట్టుకుందాం రా: జుట్టుజుట్టూ పట్టుకుని కోర్టు ముందు పిచ్చకొట్టుడు కొట్టుకున్న అత్తాకోడళ్లు (video)

55మంది వైద్యులను తొలగించిన ఏపీ సర్కారు.. కారణం అదే?

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

Lakshmi Narayan Rajyoga In Pisces: మిథునం, కన్య, మకరరాశి వారికి?

19-02-2025 బుధవారం రాశిఫలాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

Lord Shiva In Dream: కలలో శివుడిని చూస్తే.. ఏం జరుగుతుందో తెలుసా? నటరాజ రూపం కనిపిస్తే?

తమిళనాడులో ఆలయాల స్వయంప్రతిపత్తి ప్రాముఖ్యత: తిరుపతిలో మాట్లాడిన కె. అన్నామలై

తిరుమల వెంకన్న దర్శనం: మే నెలకు ఆర్జిత సేవా టిక్కెట్ల లక్కీ డిప్ కోటా విడుదల

తర్వాతి కథనం
Show comments