Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఆలయాల్లో స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలి : జేఈఓ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:31 IST)
తితిదేకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారుల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. 
 
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఉపమాక, అనంతవరం, ఒంటిమిట్ట, చంద్రగిరి, పిఠాపురం, నారాయణవనం, నగరి, అప్పలాయగుంటలోని తితిదే ఆలయాల పరిసర గ్రామాలు, మండలాల్లో శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారులను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 
 
ఇలా చేయడం వల్ల తిరుపతి నుంచి సేవకులను, భజన మండళ్లను, వేదపారాయణందారులను పంపాల్సిన అవసరం ఉండదని చెప్పారు. స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించడం ద్వారా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించారు. పరిసర ప్రాంతాల వారు కావడంతో ఉత్సాహంగా ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments