Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఆలయాల్లో స్థానిక శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలి : జేఈఓ

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:31 IST)
తితిదేకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ఉత్సవాలు, పర్వదినాల సమయంలో ఆ పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారుల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ అధికారులను ఆదేశించారు. 
 
తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఉపమాక, అనంతవరం, ఒంటిమిట్ట, చంద్రగిరి, పిఠాపురం, నారాయణవనం, నగరి, అప్పలాయగుంటలోని తితిదే ఆలయాల పరిసర గ్రామాలు, మండలాల్లో శ్రీవారి సేవకులు, భజన మండళ్ళు, వేదపారాయణందారులను గుర్తించి వారి సేవలను వినియోగించుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. 
 
ఇలా చేయడం వల్ల తిరుపతి నుంచి సేవకులను, భజన మండళ్లను, వేదపారాయణందారులను పంపాల్సిన అవసరం ఉండదని చెప్పారు. స్థానికంగా ఉన్న వారి సేవలను వినియోగించడం ద్వారా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించారు. పరిసర ప్రాంతాల వారు కావడంతో ఉత్సాహంగా ధర్మప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments