Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి గంగజాతర ప్రారంభం - అర్థరాత్రి చాటింపు - బైరాగి వేషంలో భక్తుల మొక్కులు

Webdunia
బుధవారం, 11 మే 2016 (10:34 IST)
రాయలసీమ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి పుట్టినిల్లైన అవిలాలలో చాటింపు తర్వాత చాటింపు ప్రారంభమైంది. అవిలాల నుంచి అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, సారెను తీసుకుని తిరుపతి పొలిమేరల్లో గంగ్మ తరపున తిరుపతికి చెందిన కైకాల వంశీకులు అందుకుని గంగమ్మ దేవస్థానం ఈఓ సుబ్రమణ్యంకు అందజేశారు. 
 
బుధవారం తెల్లవారుజామున మూడు గంటలలోపు తిరుపతి పొలిమేరల్లో నాలుగు దిక్కులు తిరిగి పసుపు, కుంకుమ చల్లుతూ పూజలు చేసి చాటింపు వేశారు. గంగ జాతర పూర్తయ్యే వరకు నగరంలో నివసించే పట్టణ ప్రజలు బయటకు వెళ్ళకూడదన్నది చాటింపు అర్థం.
 
బుధవారం ఉదయం నుంచే గంగమ్మ ఆలయంలో సందడి నెలకొంది. బైరాగివేషలో భక్తులు గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. విబూది, తెల్లనామం పూసుకుని, నల్లబొట్టు పెట్టుకుని రేళ్ల కాయల మాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి చేతిలో వేపాకు, చీపురు పుల్లలు పట్టుకుని బూతులు తిడుతూ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

14-05-2025 బుధవారం దినఫలితాలు - విందులు వేడుకలకు ఆహ్వానం

13-05-2025 మంగళవారం దినఫలితాలు - అవకాశాలను చేజార్చుకోవద్దు...

12-05-2025 సోమవారం దినఫలితాలు - రుణఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

11-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు...

11-05-2015 నుంచి 17-05-2025 వరకు మీ రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments