Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు, 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు

Webdunia
ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (10:56 IST)
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 24న నెల్లూరు జిల్లా, ఫిబ్ర‌వ‌రి 27న చిత్తూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
 
ఫిబ్రవ‌రి 24వ తేదీన నెల్లూరు జిల్లా దొర‌వారి స‌త్రం మండలం కొత్త‌వారి ప‌ల్లి గ్రామంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌నివాస కల్యాణం జరగనుంది.
 
అలాగే, ఫిబ్రవ‌రి 27వ తేదీన చిత్తూరు కార్పొరేష‌న్‌ మాపా‌క్షి ప్రాంతంలో ఆభ‌య ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.
 
 శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనేగాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేయ‌నున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

లేటెస్ట్

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

తర్వాతి కథనం
Show comments