Webdunia - Bharat's app for daily news and videos

Install App

18న కేరళలోని కుట్టిపురంలో శ్రీనివాస కళ్యాణం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (15:44 IST)
భగవద్‌ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 106 దివ్యదేశాల పర్యటనలో ఉన్న సంచార రథం మే 18న ఉదయం 6.30 గంటలకు కేరళ రాష్ట్రంలోని నిలంబూరు నుంచి సంచార రథం బయలుదేరి 8.30 గంటలకు పట్టాంబికి చేరుకుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అక్కడ సమీపంలోని తిరువితువక్కోడులో గల శ్రీఉయ్యావంత పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 11.30గంటలకు కుట్టిపురానికి రథం చేరుకుని తిరునావాయ్‌లో గల శ్రీ నావాయ్‌ ముగుంద పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శిస్తారు. కుట్టిపురంలో సాయంత్రం శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. 
 
ఈ సంచార రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రామానుజుల వారి విగ్రహం ఉన్నాయి. రథం ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీరామానుజుల వారిని దర్శించుకుంటున్నారని తితిదే తెలిపింది. మే 19న తిరికక్కర, మే 20న తిరువల్ల, మే 22వ తేదీన తిరువనంతపురంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నారు. 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments