Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద శేష వాహనంపై అమ్మవారు... భక్తులకు కనువిందు...

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:35 IST)
కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారు గురువారం ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు. ఏడు పడగల పెద్ద శేషవాహనంపై అమ్మావారు భక్తులకు దర్శనమిచ్చారు. మహా విష్ణువుకు ఆదిశేషుడు ప్రచండ సేవకుడిగా ప్రతీతి. పవళించే పరుపుగా, దిండుగా, గొడుగుగా, ఆభరణంగా ఆది శేషుడు మహావిష్ణువుకు సేవలు అందిస్తుంటారు. ఈ సేవలను పరిగణలోకి తీసుకుని ఆదిశేషుడిని ప్రచండ సేవకుడిగా పేరొందారు. 

 
ఈ వాహనంపై పద్మావతీ అమ్మవారు తిరుమాడ వీధులలో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ ఊరేగారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు పెద్దశేషవాహనంతో ఆరంభమైతే అమ్మవారి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు చిన్న శేష వాహనంతో ఆరంభమవుతాయి. ఈ వాహన సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీగోపాల్, జేఈవో పోలా భాస్కర్, సివిఎస్వో జి. శ్రీనివాస్, డిప్యూటీ ఈవో చెంచు లక్ష్మి, ఏఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments