Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులా మాసం పూజ కోసం నేడు తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:27 IST)
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉన్న శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు శనివారం తెరుచుకోనున్నాయి. ప్రతి యేటా జరిగే తులా మాసం పూజ‌ల కోసం సాయంత్రం 5 గంట‌ల‌కు ట్రావెన్‌కోర్ బోర్డు అయ్య‌ప్ప‌ ఆల‌యాన్ని తెర‌వ‌నుంది. 
 
ఆదివారం నుంచి 21వ తేదీ వ‌ర‌కు అయ్య‌ప్ప ఆల‌యంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తిస్తారు. అలాగే, ఆదివారం లాటరీ విధానంలో శ‌బ‌రిమ‌ల ఆల‌య ప్ర‌ధాన పూజారిని ఎంపిక చేయ‌నున్నారు. 21న శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు మూసివేయ‌నుంది. 
 
మ‌ళ్లీ న‌వంబ‌ర్ 2వ తేదీన ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. ఆ మ‌రుస‌టి రోజే ఆలయాన్ని మూసేసి, మండ‌లం - మ‌క‌ర‌విలాక్కు పండుగ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 15న ఆల‌యాన్ని మ‌ళ్లీ తెర‌వ‌నున్నారు.
 
అయితే, ఆదివారం నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు వ‌ర్చ్యుల్ బుకింగ్ ద్వారానే అనుమ‌తిస్తారు. ఇక కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్త‌యిన స‌ర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్ప‌నిసరిగా తమ వెంట తీసుకునిరావాలన్న నిబంధనను ట్రావెన్‌కోర్ దేవస్థానం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం స్టంట్స్.. ట్రాక్టర్‌పై పడుకుని డ్రైవింగ్ చేశాడు... (వీడియో వైరల్)

లోకేశ్ భవిష్యత్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబు : అసదుద్దీన్

రూ.50 వేలు డబ్బు కోసం ఐదు రోజుల పెళ్లి .. ఎక్కడ?

Hyderabad: బ్రాస్లెట్ కోసం గొడవ: చెంపదెబ్బ భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య.. చివరికి?

KTR: ఒకసారి కాదు, 100 సార్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా వున్నాను.. కేటీఆర్

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments