Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది తిరుమల తిరుపతి కాదు.. తెలంగాణ తిరుపతి?

Webdunia
ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (09:50 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు కొత్త పాలక మండలికి కొత్త సభ్యులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. గత సంప్రదాయాలకు విరుద్ధంగా జంబో పాలక మండలిని జగన్ సర్కారు నియమించింది. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి ఏకంగా తొమ్మిది మందికి చోటు కల్పించారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై రాయలసీమ పోరాట సమితి మండిపడింది. 
 
ఏపీతో పాటు తెలంగాణ,  తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి పలువురికి స్థానం కల్పించగా, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలంగాణ తిరుపతి దేవస్థానంగా మార్చారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌ కుమార్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ బోర్డును రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
 
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలపై కళంకితులకు చోటుకల్పించారని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈ బోర్డు వద్దే వద్దని అన్నారు. కాగా, బీజేపీ సైతం బోర్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన దేవాలయంలో రాష్ట్రానికి చెందిన సభ్యులతో పోలిస్తే, ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

బైకు కొనివ్వలేదని తండ్రిపై గొడ్డలితో దాడి... తీవ్ర గాయాలు...

తల్లికి అక్రమ సంబంధాలు ఉన్నాయనీ.. ఆమెపైనే అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధ కుమారుడు!

అన్నీ చూడండి

లేటెస్ట్

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

జన్మాష్టమి 2025: పూజ ఎలా చేయాలి? పసుపు, నీలి రంగు దుస్తులతో?

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

తర్వాతి కథనం
Show comments