Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే అంతే సంగతులు.. టీటీడీ

సెల్వి
ఆదివారం, 1 డిశెంబరు 2024 (13:17 IST)
తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. 
 
ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, రాజకీయ ప్రసంగాలకు దూరంగా ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని శనివారం ఓ ప్రకటనలో టీటీడీ పేర్కొంది.
 
నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులు కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు.
 
మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు.. విమర్శలు చేయడం పరిపాటిగా మారడంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని టీటీడీ గుర్తించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

తర్వాతి కథనం
Show comments