Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు... భద్రతను సమీక్షించిన టీటీడీ ఈవో, ఎస్పీ

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (21:22 IST)
తిరుపతి: తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అధికారులు భద్రతను, ఏర్పాట్లను సమీక్షించారు. తిరుచానూరులోని అన్ని ప్రాంతాలలో తిరిగి ఏర్పాట్లును పరిశీలించారు. తిరుచానూరులో ఈ నెల 19 నుంచి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకు కనీసం 30 వేల మంది భక్తులు తిరుచానూరుకు విచ్చేస్తుంటారు. 
 
ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు టీటీడీ, అటు తిరుపతి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అయితే రానున్న రోజుల్లో మరింత ముఖ్యమైన వాహన సేవలు జరుగనున్నాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజి గోపాల్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టిలతోపాటు జేఈవో పోలా భాస్కర్లు తిరుచానూరు మాడ వీధులను పరిశీలించారు. 
 
వాహనాలు తిరిగే చోటులో ఏర్పాట్లను పరిశీలించారు. అదే సమయంలో భద్రతను పటిష్టం చేసే అంశంపై చర్చించారు. పుష్కరణి చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించి సమీక్ష జరిపారు. గట్టి భద్రతా చర్యలు చేపడుతూనే ఎక్కడా భక్తులకు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments