Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూలోక వైకుంఠాన్ని తలపించేలా పద్మావతి పరిణయోత్సవం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:25 IST)
తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం కన్నుల పండువగా కొనసాగుతోంది. రెండa రోజు కూడా నారాయణగిరి ఉద్యానవనంలో ఎంతో వైభవంగా స్వామి, అమ్మవార్ల పరిణయోత్సవాన్ని తితిదే వేదపండితులు నిర్వహించారు. భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్ముతున్న స్వర్ణిమ మండపంలో ఉత్సవాలను తితిదే అట్టహాసంగా నిర్వహిస్తోంది. 
 
పరిణయోత్సవల్లో భాగంగా రెండో రోజు పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. పూలబంతులాట్లో తితిదే ఈఓ దంపతులు పాల్గొన్నారు. ఆస్థానాన్ని నిర్వహించారు. 
 
శ్రీవారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలను నివేదించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు బంగారు పల్లకినెక్కి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండోరోజు ఉత్సవం ముగిసింది. పరిణయోత్సవంలో పాల్గొన్న భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణను తితిదే అందజేసింది. ఈ పరిణయోత్సవ వేడుకలు బుధవారంతో ముగియనున్నాయి. 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

తర్వాతి కథనం
Show comments