Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్కర ఘాట్లలో నీళ్ళెక్కడ? మోకాళ్ల లోతు నీటిలో మునకెలా? జల్లు స్నానాలతో సరి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల తొలిరోజునే భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాల కోసం వచ్చే యాత్రికులు స్నానం చేసేందుకు వీలుగా కృష్ణా బ్యారేజీకి దిగువ

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (14:45 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కృష్ణా పుష్కరాల తొలిరోజునే భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాల కోసం వచ్చే యాత్రికులు స్నానం చేసేందుకు వీలుగా కృష్ణా బ్యారేజీకి దిగువ భాగంలో ఏర్పాటు చేసిన ఘాట్లలో చుక్కనీరు లేదు. ఒక వేళ నీరు ఉన్నా.. అది మోకాళ్ళలోతు వరకే ఉంది. దీంతో పుష్కర యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
వాస్తవానికి శ్రీశైలం నుంచి ఎగువకు నదిలో నీరున్నప్పటికీ, దిగువన ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కింద ఏర్పాటు చేసిన ఏ ఘాట్‌కు కూడా నీరు చేరని పరిస్థితి నెలకొంది. దీంతో అధికారులు పైపుల ద్వారా జల్లు స్నానాలు చేసే ఏర్పాటు చేయగా, భక్తులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కనీసం 4 అడుగుల మేరకు నీరుంటే తప్ప ఓ మునక వేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు చాలా ఘాట్లలో రెండడుగుల నీరు కూడా లేదు. మోకాళ్లలోతు నీటిలో మునకెలా వేయాలో తెలియక భక్తులు నానా తిప్పలు పడుతున్నారు. 
 
నాగార్జున సాగర్ దిగువున దేశాలమ్మ, సత్రశాల పరిధిలో 2 అడుగుల మేరకు నీరుండగా, దైదలో ఒక అడుగు మేరకు మాత్రమే నీరుంది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలోని గోవిందాపురం, ఎల్లంపల్లి, రేగులగడ్డల్లో అసలు నీరే లేదు. ఇక ప్రకాశం బ్యారేజీలో 12 అడుగుల మేరకు నీరుండగా, దిగువ ఘాట్లకు కాస్తంత వదలడంతో, అది 10 అడుగులకు చేరింది. 
 
బ్యారేజ్ దిగువన పెనుమూడి ఘాట్‌ను అర కిలోమీటర్ పొడవులో నిర్మించగా, భక్తుల స్నానాలకు చాలినంత నీరు వదలాలంటే, బ్యారేజ్ ఎగువన దుర్ఘా ఘాట్‌కు నీరు చాలని పరిస్థితి నెలకొంది. బ్యారేజ్ దిగువ ప్రాంతాల్లో 38 ఘాట్లను అధికారులు ఏర్పాటు చేయగా, ఏ ఘాట్ దగ్గర కూడా నిండా మునిగేంత నీరు లేదు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి నీరు వస్తేనే కానీ భక్తులు సంతృప్తిగా పుష్కర స్నానం చేయలేని పరిస్థితి నెలకొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sritej: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పుష్ప2 బాధితుడు శ్రీతేజ్

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sarva Pitru Amavasya 2025: ఏప్రిల్ 29న సర్వ అమావాస్య.. ఇవి చేస్తే పితృదోషాలుండవ్!

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

తర్వాతి కథనం
Show comments