Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. 43 రోజుల్లో స్వామి సేవలో 35 లక్షల మంది

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (10:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త రికార్డును నమోదు చేసింది. అది కూడా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించి. గతంలో వేసవి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా అనూహ్యంగా వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించింది. మే 1వ తేదీ నుంచి ఆదివారం వరకు 43 రోజుల్లో 35 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
సాధారణంగా భక్తుల రద్దీ పెరిగితే ఆందోళనలు, తితిదే ఉన్నతాధికారులపై శాపనార్థాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పెద్దగా ఎక్కడ కూడా ఇలాంటివి కనిపించలేదు. కారణం వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి అలాగే క్యూలైన్లలోకి వదలడం. దీని కారణంగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకోగలిగారు. 
 
తితిదే ఈఓ సాంబశివరావుతో పాటు జెఈఓ శ్రీనివాసరాజుల పర్యవేక్షణే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన సమయంలో వెంటనే వీఐపీ దర్శనాలను రద్దు చేయడమో, తగ్గించడమో చేయడం వల్ల సామాన్యభక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకోగలిగారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Bathukamma: బ్రెజిల్ రియో ​​కార్నివాల్ స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తాం: జూపల్లి

వినాయక చవితి పండుగ తర్వాత గణేష్ విగ్రహాలను నిమజ్జనం ఎందుకు చేస్తారు?

Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి

01-09-2025 సోమవారం ఫలితాలు - పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది...

01-09-2025 నుంచి 30-09-2025 వరకు మీ మాస గోచార ఫలాలు

తర్వాతి కథనం
Show comments