Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాలకు శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణం - టిటిడి ఈవో

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:25 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నమూనా ఆలయాన్ని కృష్ణా పుష్కరాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను టిటిడి ఈవో సాంబశివరావు ఆదేశించారు. నవ్యాంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారుచేయాలన్నారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో టిటిడి ఇంజనీరింగ్‌ అధికారులతో ఈవో సమావేశమయ్యారు.
 
టిటిడి నిర్మించిన ఆలయాల్లో విగ్రహాలకు సంబంధించి ఆలయ నిర్మాణ శైలిని పరిశీలించడానికి మార్పులు చేయడానికి సీఇ ఆధ్వర్యంలో స్థపతి, అర్చకులు, ఇంజనీరింగ్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఈవో తెలిపారు. మే 10వ తేదీన శ్రీరామానుజ సహస్రాబ్ధి సంధర్భంగా ప్రత్యేకంగా పుస్తకాలు, సీడీలను ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 
 
మే 22 నుంచి ప్రారంభం కానున్న శుభప్రదంకు అవసరమైన పుస్తకాల ముద్రణ పూర్తిచేయాలని సూచించారు. అలిపిరి వద్ద వాటర్‌ కూలర్స్ ఏర్పాటు చేయాలని, నడక దారిలో ఎండ వేడి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు మెట్లపై తెల్లరంగు వేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments