Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో క్రిష్ణాష్టమి వేడుకలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:04 IST)
తిరుపతిలోని టిటిడి గోశాలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు గోశాలలోని వేణుగోపాలస్వామి వారిని దర్సించుకున్నారు. 
 
అనంతరం గోమాత, దూడకు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్ళి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
 
అలాగే శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పుస్తక జపసమర్పణ చేస్తూ ఆలయాన్ని సందర్సించి అక్కడ పుస్తకంలో ఓం నమో వేంకటేశాయ అని రాశారు. తిరుపతిలోనే కాదు తిరుమలలోను గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
 
తిరుమలలోని గోగర్భం డ్యాం చెంత ఉన్న ఉద్యావనంలో కాళీయమర్ధనుడు అయిన చిన్నిక్రిష్ణునికి ప్రత్యేక పూజలు జరిపారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణమాసంలో ఎవరిని పూజించాలి.. ఏం తీసుకోవచ్చు.. ఏం తీసుకోకూడదు?

Shravana Masam 2025: శ్రావణ మాసం పండుగల వివరాలు.. వరలక్ష్మి వ్రతం ఎప్పుడు?

Sravana Masam: శ్రావణ మాసం ప్రారంభం.. శుక్రవారం రోజున తామర పూలతో మాలను అమ్మవారికి?

25-07-2025 శుక్రవారం దినఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు...

24 సంవత్సరాల తర్వాత జూలై 26న గజలక్ష్మీ యోగం.. ఏ రాశులకు అదృష్టం?

తర్వాతి కథనం
Show comments