Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపచారం.. వర్షం పడుతోందన్న నెపంతో గోవిందరాజుని మోహినీ అవతారాన్నే నిలిపేశారు...

Webdunia
బుధవారం, 18 మే 2016 (15:00 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులో అపచారం చేశారు. బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండటంతో ఏకంగా గోవిందరాజస్వామి వాహనసేవనే నిలిపేశారు. ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుందోన్న నెపంతో వాహనాన్ని ఊరేగించీ ఊరేగించకుండానే మమ అనిపించేశారు. తితిదే చరిత్రలో మొదటి సారి బ్రహ్మోత్సవాల్లో స్వామి, అమ్మవార్లు మాఢా వీధుల్లో ఊరేగింపుకు రాలేదు. 
 
గోవిందరాజుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి, అమ్మవార్లు మోహినీ అవతారంలో ఊరేగాల్సి ఉంది. వాహనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా తితిదే చేసింది. అయితే వర్షం పడుతోందని వాహనసేవను నిలిపివేసింది. 
 
ఆలయంలోపలి నుంచి బయటకు వాహనాన్ని తీసుకుని రానే లేదు. ఉత్సవమూర్తులను ఆలయం లోపలే ఉంచేశారు. గతంలో తితిదే ఎన్నోసార్లు వర్షాలు కురిసినా పెద్ద పెద్ద గొడుగులతో వాహనసేవలను కొనసాగిస్తుంది. అయితే ఈ సారి తితిదే అధికారులు తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహన సేవ జరుగకపోతే అపచారమంటూ పలువురు భక్తులు చెప్పుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

తర్వాతి కథనం
Show comments