Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గమ్మ భక్తులపై భారీ వడ్డన.. దర్శనం మరింత ప్రియం - బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (09:05 IST)
బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం మరింత ప్రియం కానుంది. భక్తులపై అదనపు చార్జీలు వసూలు చేయాలని దుర్గమ్మ ఆలయ పాలక మండలి నిర్ణయించింది. అంటే, దర్శన టిక్కెట్లతో పాటు.. ఇతర ప్రసాదాల ధరలు పెంచాలని తీర్మానించింది. ఈ పెంచిన ధరలు కొత్త సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన దేవస్థానం పాలకమండలి సమావేశంలో చర్చించి తీర్మానాన్ని ఆమోదించారు. 
 
ముఖ్యంగా, ప్రతి రోజూ సాయంత్రం పంచహారతుల సమయంలో రూ.500 ఆర్జిత సేవా టికెట్‌పై ఇద్దరు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. జనవరి 1నుంచి ఈ టికెట్‌పై ఒకరిని మాత్రమే అనుమతించనున్నారు. 
 
ఇకపై పంచహారతుల సమయంలో దంపతులు పంచహారతుల సేవకు వెళ్లాలంటే రూ.1,000 సమర్పించుకోవాల్సిందే. అలాగే అమ్మవారి పులిహోర ప్రసాదాన్ని ప్రస్తుతం 150 గ్రాముల ప్యాకెట్‌ రూ.5కు విక్రయిస్తున్నారు. ఇకపై 200 గ్రాముల పులిహోర ప్యాకెట్‌ను రూ.10కు విక్రయించాలని నిర్ణయించారు.
 
మరోవైపు తిరుమల తరహాలో ఇంద్రకీలాద్రిపై కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అనుమతి కోసం దేవదాయశాఖ కమిషనర్‌కు పంపేందుకు తీర్మానాన్ని ఆమోదించారు. ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఉదయం 6-9 గంటల వరకు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరిప్రదక్షణ నిర్వహించేందుకు పాలకమండలి తీర్మానం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

15-02-2025 శనివారం రాశిఫలాలు - ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి...

అలాంటి వాడిది ప్రేమ ఎలా అవుతుంది? అది కామం: చాగంటి ప్రవచనం

Phalgun Month 2025: ఫాల్గుణ మాసం వచ్చేస్తోంది.. చంద్రుడిని ఆరాధిస్తే.. పండుగల సంగతేంటి?

14-02-2025 శుక్రవారం రాశిఫలాలు - అకాల భోజనం, విశ్రాంతి లోపం....

తర్వాతి కథనం
Show comments