Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్ శేషాద్రికి ఉద్వాసన? ఒక్క జీవోతో వేటు (video)

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (16:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పేరు చెబితే ఠక్కున గుర్తుకువచ్చేది తొలుత శ్రీవారు. ఆ తర్వాత డాలర్ శేషాద్రి. ఎన్నో దశాబ్దాలుగా ఆయన స్వామివారి సేవకు అంకితమైపోయారు. అలాంటి డాలర్ శేషాద్రిపై విమర్శలతో పాటు.. ప్రశంసలు కూడా ఉన్నాయి. 
 
నిజానికి తితిదేలో పదేళ్ల క్రితమే పదవీ విరమణ చేసిన డాలర్‌ శేషాద్రి ఇప్పటికీ స్వామి వారి సేవలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 2323 నంబరు జీవోతో ఆయనపై కూడా వేటుపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే సుదీర్ఘకాలం నుంచి ఉన్న డాలర్‌ శేషాద్రి సేవలకు ముగింపు పలికినట్టే.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తాజా జీవో మేరకు ఈ యేడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసి కొనసాగింపులో ఉన్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టడంలో నిమగ్నమయ్యారు.
 
ఇలా విధుల్లో కొనసాగుతున్న సిబ్బందిని గుర్తించి నివేదిక ఇవ్వాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం ఈరోజు రాత్రిలోపు 60 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో డాలర్‌ శేషాద్రితోపాటు, టీటీడీ ఇటీవల చేసిన 12 మంది ఉద్యోగాల నియామకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments