Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంలో మరో అపచారం.. ఏంటది?

టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఏది చేయాలన్నా ఆగమాలకు లోబడే చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్థంగా వ్యవహరిస్తూ భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (13:23 IST)
టిటిడి ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆధ్మాత్మిక క్షేత్రం తిరుమలలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీవారి ఆలయంలో ఏది చేయాలన్నా ఆగమాలకు లోబడే చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్థంగా వ్యవహరిస్తూ భక్తులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారు టిటిడి ఉన్నతాధికారులు. ఎన్నో యేళ్ళుగా వస్తున్న ఆగమాలను ఒక్కసారిగా మార్చేస్తున్నారు. ఆగమ పండితులు, సలహాదారుల సలహాలను తీసుకోకుండానే ఇష్టానుసారం నిర్ణయాలను తీసేసుకుంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు. అలాంటి నిర్ణయమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారి మరో అపచారానికి తెర లేచింది. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికైనా, దర్శించుకున్న తరువాతైనా బయటకు రావాలంటే వెండివాకిలి నుంచి ఒకటే మార్గం. ఎన్నో సంవత్సరాల నుంచి అది ఒకటే మార్గం ఉంది. ఇది ఇప్పటిది కాదు ఆగమ శాస్త్రాల ప్రకారంగానే నడుస్తోంది. అలాంటిది టిటిడి ఉన్నతాధికారులు భక్తులు బయటకు వచ్చే ప్రాంతంలో ఇనుప మెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొని హడావిడిగా ఏర్పాటు చేసేశారు. నిన్న రాత్రికి రాత్రే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. వెండివాకిలి కుడివైపు ఉన్న రెండవ ప్రాకారానికి ఇనుప మెట్లను నిర్మించేశారు. ఆగమాల ప్రకారం ఇలా నిర్మించకూడదు. అందులోను 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఈ ప్రాకారం ఉంది. 
 
టిటిడి ఉన్నతాధికారులు ఇష్టానుసారం నిర్ణయం తీసేసుకుని ఆగమేఘాలపై హడావిడి చేసి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మఠాధిపతులు, పీఠాధిపతులు టిటిడి ఉన్నతాధికారుల నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆగమాలను అధిగమించడానికి టిటిడి ఉన్నతాధికారులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. టిటిడి ఉన్నతాధికారులు ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా.. లేకుంటే ఆగమాలకు విరుద్ధంగా కొనసాగిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

23-08-2025 శనివారం దిన ఫలితాలు - మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది...

శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?

తర్వాతి కథనం
Show comments