Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నచిత్రమైనా, పెద్ద చిత్రమైనా మీ ఆశీర్వాదం అవసరం: దర్శకుడు మారుతి

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:16 IST)
కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య బాగా తగ్గిందన్న విషయం తెలిసిందే. అందులోనూ వీఐపీల తాకిడి కూడా క్రమేపీ మూడు నెలల క్రితం బాగా తగ్గింది. కానీ ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారిన పడే వారి సంఖ్య మరింతగా తగ్గడంతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. సామాన్యులతో పాటు వీఐపీలు కూడా తిరుమలకు రావడం మొదలుపెట్టారు.
 
కరోనా విజృంభిస్తున్న సమయంలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చే ప్రముఖుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఏ సినిమా షూటింగ్ ప్రారంభించినా.. ఏ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నా ముందుగా తిరుమల శ్రీనివాసుని ఆశీస్సులు పొందేవారు. కానీ సినిమా షూటింగులు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ నుంచి తిరుమలకు వచ్చే వారే కరువయ్యారు.
 
కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో కొంతమంది డైరెక్టర్లు చిన్న సినిమాలను తీస్తూ వచ్చారు. అందులో విలక్షణ దర్శకుడు మారుతీ కూడా ఉన్నారు. మంచిరోజులొచ్చాయ్ అనే టైటిల్‌తో ఒక చిన్న సినిమాను తీశారు దర్శకుడు మారుతి.
 
తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం దర్శించుకున్న తర్వాత తన సినిమా త్వరలో థియేటర్లలో విడుదల అవుతుందని.. ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాడు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు ఉందంటున్నాడు దర్శకుడు మారుతి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

తర్వాతి కథనం
Show comments