Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో పోటెత్తిన భక్తజనం - పట్టించుకోని తితిదే అధికారులు

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (11:12 IST)
వరుసగా నాలుగురోజుల పాటు సెలవు దినాలు రావడంతో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో పోటెత్తింది. అంబేద్కర్‌ జయంతి నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులు రావడంతో భక్తులు అధికసంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలలోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. 32 కంపార్టుమెంట్లు నిండిపోయి 3 కిలోమీటర్లకుపైగా లైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల కంపార్టుమెంట్లు కూడా నిండిపోయాయి. అలాగే తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట వద్ద అదే పరిస్థితి. తలనీలాలు సమర్పించడానికి 5 గంటలకుపైగా సమయం తిరుమలలో పడుతోంది. 
 
గదులు లేకపోవడంతో భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. అయితే వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తుల ఉక్కపోతతో విలవిలలాడిపోతున్నారు. ఎప్పటిలాగే టిటిడి భక్తుల విషయంలో చేతులెత్తేసింది. తమకేమీ సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. కొంతమంది భక్తులు  గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండగా మరికొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. గురువారం శ్రీవారిని 70,520 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.88 కోట్లు వసూలైంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments