Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ కనకదుర్గ ఆలయంలో శఠారి ఆశీర్వాదం నిలిపివేత, ఆర్జిత సేవలు కూడా..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (18:35 IST)
కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రద్దీ ఉన్న ప్రాంతాల నుంచే ఈ కేసుల సంఖ్య ఎక్కువవడానికి కారణమవుతోంది. మాస్కులను ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో పాటు శానిటైజర్లను వాడకపోవడంతో కరోనా బారిన చాలామంది పడుతున్నారు. దీంతో దేవదాయశాఖ అప్రమత్తమైంది. ఆలయాల వద్ద ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి కొన్ని ఆలయాల్లో నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది.

 
ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలను విధించారు. ఆలయంలోని దుర్గమ్మ అంతరాలయ దర్సనంతో పాటు శఠారిని పూర్తిగా నిలిపివేశారు. అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

 
ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేశారు. దుర్గమ్మ దర్సనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. మాస్కులు లేని భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు.

 
ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నారని ఈఓ భ్రమరాంభ స్పష్టం చేశారు. అంతే కాకుండా కోవిడ్ ఉదృతి నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేస్తున్నామని.. భక్తులు ఇందుకు సహకరించాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. కవితకు బెయిల్ పొడిగింపు

కౌంటింగ్ నేపథ్యంలో పిఠాపురంలో హింసకు ఛాన్స్ : నిఘా వర్గాల హెచ్చరిక!!

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

తర్వాతి కథనం
Show comments