Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదుపులోకిరాని కరోనా... శ్రీవారి దర్శనం ఇప్పట్లే లేనట్టే...

Webdunia
ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (09:46 IST)
దేశంలో కరోనా వైరస్ అదుపులోకిరావడం లేదు. పైగా, మరింతగా విజృంభిస్తోంది. దీనికి నిదర్శనమే.. శనివారం ఒక్కరోజు ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం. దీంతో ఈ నెల 14వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడగించాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచన మేరకు కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం కేవలం వేదపండితులు మాత్రమే శ్రీవారికి రోజువారీ కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ అదుపులోకి రాకపోవడంతో తిరుమలలోనూ దర్శనాల నిలిపివేతను కొనసాగించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
 
ఈ మేరకు తితిదే అధికారులు నేడో, రేపో అధికారిక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది. గత నెలలో లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు, ఆపై దాన్ని ఏప్రిల్ 14 వరకూ పొడిగించారు. 
 
ఇప్పుడు లాక్‌డౌన్ మరోమారు పొడిగించక తప్పదన్న అంచనాల నేపథ్యంలో, భక్తులకు దర్శనం రద్దు నిర్ణయాన్ని కొనసాగించనున్నట్టు సమాచారం. నెలాఖరు వరకూ దర్శనాలు నిలిపివేసి, ఆపై పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాత బస్తీలో విషాదం : గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా ముగ్గురి మృతి

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

లేడీ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన తాగుబోతు ఆటో డ్రైవర్

నేడు తీరందాటనున్న వాయుగుండం : ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

ముంబై మహానగరంలో రెడ్ అలెర్ట్ .. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

16-08-2025 శనివారం దినఫలాలు - సర్వత్రా కలిసివచ్చే సమయం...

17-08-2025 నుంచి 23-08-2025 వరకు మీ వార రాశిఫలితాల

Janmashtami: శ్రీ కృష్ణుడి రాసలీలల పరమార్థం ఏంటి?

తర్వాతి కథనం
Show comments