Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మానుష్యంగా శ్రీవారి మాడవీధులు.. రాత్రివేళల్లో క్రూరమృగాల సంచారం?!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (07:32 IST)
నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ సందడిగా ఉండే తిరుమల గిరులు ఇపుడు బోసిబోయికనిపిస్తున్నాయి. భక్తులు లేక ఏడుకొండలు వెలవెలబోతున్నాయి. పైగా, రాత్రి సమయాల్లో క్రూరమృగాలు సంచారం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తుల రాకను తితిదే పాలక మండలి నిలిపివేస్తూ సంచలాత్మక నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఏడుకొండలు బోసిబోయి కనిపిస్తున్నాయి. పైగా, శ్రీవారి నిలయం ఇలా నిర్మానుష్కంగా కనిపించడం గత 128 యేళ్ళలో ఇదే తొలిసారి అని చరిత్రపుటలు చెబుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో కరోనా భయం కారణంగా భక్తుల రాకను అడ్డుకోవడంతో కొన్నిరోజులుగా తిరుమల క్షేత్రం బోసిపోయినట్టు కనిపిస్తోంది. నిత్యం భక్తజనసందోహంతో కోలాహలంగా ఉండే మాడవీధులు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న తిరుమల వీధుల్లో క్రూరమృగాలు సంచరిస్తున్నాయి. 
 
రాత్రివేళల్లో కల్యాణవేదిక, నారాయణగిరి, ముల్లగుంట ప్రాంతాల్లో చిరుతపులులు, ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్టు గుర్తించారు. జంతువుల సంచారంతో విజిలెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండపై ఉన్న స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎవరూ బయట తిరగవొద్దని అధికారులు విజ్ఞప్తిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments