Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదగిరిగుట్ట అభివృద్ధికి టి. సర్కారు చర్యలు.. సుందరంగా..?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2015 (14:25 IST)
యాదగిరిగుట్ట అభివృద్ధికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టనుంది. యాదగిరి దాని చుట్టూ ఉన్న చెరువులను కూడా అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా గుట్ట చుట్టూ గల నాలుగు చెరువుల్ని సుందరంగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కారు డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ప్రభుత్వం నుంచి రూ.16.59 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 
 
యాదాద్రి అభివృద్ధిపై అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఏయూనడీ ముఖ్యకార్యదర్శి ఎంజీ గోపాలన్, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ ప్రత్యేక అధికారి కిషన్ రావు, నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు. గుట్ట అభివృద్ధిపై తీసుకోవాల్సిన చర్యలపై వారితో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, సేవలు, భక్తుల సౌకర్యాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments