Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి భక్తులకు శుభవార్త, బ్రేక్ దర్సనం పునఃప్రారంభం

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (18:58 IST)
కరోనా కారణంగా ఆలయాల్లో సేవలు, ప్రత్యేక దర్సనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరు లాంటి ప్రధాన ఆలయాల్లో ఇప్పటికీ సాధారణ దర్సనమే ఉంది. విఐపిలు 100 రూపాయలు ఇచ్చి దర్సనానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక ప్రతిరోజు ఉండే కుంకుమార్చనను కూడా పూర్తిగా నిలిపేశారు.
 
అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్సనాలను పునఃప్రారంభించాలని టిటిడి భావిస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి బ్రేక్ దర్సనం పునఃప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్సకాల అనుసరించి జూన్ 8వ తేదీ నుంచి ఆలయంలో అమ్మవారికి దర్సనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
 
ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు విఐపి బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి అమలు చేయనుంది. ప్రోటోకాల్ విఐపిలకు నిర్ధేశించిన సమయంలో అమ్మవారి దర్సనం కల్పించేందుకు సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments