Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలంలో నిత్యకళ్యాణం - ప్రసాదం టిక్కెట్ ధరల పెంపు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (07:33 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం ఆలయంలో అర్జిత సేవల టిక్కెట్ల ధరలను పెంచేశారు. ప్రసాదం ధరను కూడా పెంచారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రసాదం, అభిషేకం, అర్జన, కేశఖండన టిక్కెట్ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యంగా, నిత్య కళ్యాణం, అభిషేకం టిక్కెట్ ధరను ఏకంగా రూ.1500 చేశారు. 
 
అలాగే, ప్రస్తుతం రూ.15గా ఉన్న కేశఖండన ధరను కూడా రూ.20కి పెంచారు. నిత్యకళ్యాణం టిక్కెట్ ధర రూ.1500, అర్చన టిక్కెట్ ధర రూ.300, అభిషేకం టిక్కెట్ ధర రూ.1500 చొప్పున పెంచుతూ ఆలయ కమిటి నిర్ణయం తీసుకుంది. 
 
అదేవిధంగా 100 గ్రాముల చిన్న లడ్డు ధర రూ.20 నుంచి రూ.25కు పెంచగా, పులిహోర ధర రూ.10 నుంచి రూ.15కు పెంచింది. చక్కెర పొంగలి ధర రూ.10 నుంచి రూ.15కు పెంచారు. అదేవిధంగా అర కేజీ బరువు ఉండే మహాలడ్డు బరువును 400 గ్రామాలు తగ్గించారు. ధరను మాత్రం రూ.100గా ఉంచారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments