వరుస సెలవులు .. తిరుమలకు పోటెత్తిన భక్తులు...

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (08:55 IST)
శనివారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో అన్ని వైకుంఠ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లలో కూడా చోటు లేకపోవడంతో ఫుట్‌పాత్‌లపైనే భక్తులను వరుస క్రమంలో కూర్చొన్నారు. 
 
ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాల కారణంగా రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తితిదే అధికారులు ముందుగానే తెలిపారు. స్వామి వారి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు వేచి ఉన్నారు. దాదాపు ఆరు కిలోమీటర్లకుపైగా క్యూలైన్లు, రింగ్‌రోడ్డులో రద్దీ నెలకొంది. వీరి దర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.
 
శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా పెరిగిన రద్దీతో తితిదే సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్‌, వృద్ధులు, వికలాంగుల దర్శనాలను ఈ నెల 21 వరకు రద్దు చేస్తున్నామని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీ తగ్గే వరకు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

తర్వాతి కథనం
Show comments