Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలపై అమ్మ ఎఫెక్ట్... గంటలోపే తిరుమలేశుని దర్శనం...

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తమిళీయులే ఉంటారు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు దర్శించుకుంటే అందులో 40 శాతం మంది తమిళీయులే ఉంటుంటారు. తమిళనాడు నుంచే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. తమిళులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్యద

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (14:40 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తమిళీయులే ఉంటారు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు దర్శించుకుంటే అందులో 40 శాతం మంది తమిళీయులే ఉంటుంటారు. తమిళనాడు నుంచే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. తమిళులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్యదైవం. సాధారణ సమయాల్లో తమిళులు ఈ స్థాయిలో వస్తే రద్దీ సమయాల్లో చెప్పనవసరం లేదు. కోవిందా....(గోవిందా) కోవిందా అంటూ తిరుమలకు చేరుకుంటుంటారు. ఎక్కువమంది భక్తులు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు కాలినడక వచ్చి స్వామివారికి మ్రొక్కులు సమర్పిస్తుంటారు.
 
అలాంటి తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కనిపించడం లేదు. కారణం అమ్మ ఎఫెక్ట్. అమ్మ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. తమిళీయులు అమ్మగా భావించే జయలలిత. ఆమె మరణంతో ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రం మూగబోయింది. అమ్మను కోల్పోయామన్న బాధలో ఉన్న తమిళీయులు ముభావంగా కూర్చుండిపోయారు. కన్నీంటి పర్యాంతమవుతూ జయ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నారు. దీంతో నిన్నటి నుంచి కూడా తమిళ నాడు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. బుధవారానికైతే కాలినడక భక్తులు అసలు  కనిపించడం లేదు. కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి.
 
ఇదంతా చూస్తున్న తితిదే ఉన్నతాధికారులకు అన్నీ అర్థమైపోయింది. అంతా అమ్మ ఎఫెక్టేనని. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడక దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అంత తొందరగా దర్శనం జరుగుతుంటే సామాన్యభక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. మరో వారంపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తితిదే భావిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments