Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాజులతో కనకదుర్గ అమ్మవారికి అలంకరణ...

బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (20:41 IST)
బెజవాడ ఇంద్రకీలాద్రిపై గాజుల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మంగళ వారం రోజున కనకదుర్గ అమ్మవారిని అత్యంత ప్రసన్నమూర్తిగా గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టుతో పాటు అంతరాలయాన్ని సైతం గాజులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఉత్సవం కోసం భక్తుల నుంచి 4 లక్షలకు పైగా గాజులు వచ్చాయి. మరో లక్ష గాజులు ఆలయ అధికారులు కొనుగోలు చేసి అలంకరణకు ఉపయోగించారు. ప్రధాన ఆలయంతో పాటు మహా మండపంలోని ఉత్సవ మూర్తికి ఈ గాజులతో అలంకారం చేసారు. 
 
ఎక్కువ గాజులను ఇక్కడే ఉపయోగించారు. గాజులోత్సవం వేడుకను చూడాలంటే ఉత్సవమూర్తిని దర్శించుకోవాల్సిందే. దుర్గమ్మను ఇలా అలంకరించి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం ఇక్కడ భక్తుల్లో ఆనందాన్ని నింపుతోంది. తొలిసారిగా  అమ్మవారికి గాజులతో ప్రత్యేకంగా అలంకరించటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
అమ్మవారిని దసరా వేడుకల్లోనే కాకుండా ఇలాంటి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించటం ఆలయ వైభవాన్ని మరింతగా పెంచటమేనని చెబుతున్నారు. గాజుల అలంకారంలో అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారీ వర్షాలు- గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక

Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబును నమస్కరించిన రోబో.. ఎక్కడో తెలుసా? (video)

నటి నోరా ఫతేహీలా ఉండాలంటూ భార్య వర్కౌట్ చేయాలంటూ చిత్రహింసలు..

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

అన్నీ చూడండి

లేటెస్ట్

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

తర్వాతి కథనం
Show comments