Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి కానుకగా రూ. 50లక్షల కటి, వరద హస్తాలు

Webdunia
WD
కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమలేశునికి రూ.50లక్షల కటి, వరద హస్తాలను ఓ భక్తుడు కానుకగా అందజేశాడు. ఈ కటి, వరదహస్తాల్లో మూడు కిలోల బంగారాన్ని వాడారని, ఈ హస్తాల విలువ రూ. 50లక్షలుంటుందని తితిదే అధికారులు తెలిపారు. గురువారం రాత్రి వీఐపీ బ్రేక్‌లో దర్శనానికి వెళ్లిన సదరు భక్తుడు గుడిలోపల ఈవో కృష్ణారావుకు కటి, వరద హస్తాలను అందజేశారు.

ఇదిలా ఉంటే.. తిరుమలేశుని ఆలయంలో టీటీడీ ఉన్నతాధికారులు ఓ ప్రయోగం చేశారు. ప్రతి గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది. దీంతోపాటు అన్ని సేవలు ముగిశాక ఉదయం 9 గంటలకు వీఐపీలు గంటపాటు దర్శనానికి వస్తుంటారు. ఆ తర్వాతే సామాన్యులను సర్వదర్శనం కింద అనుమతిస్తారు.

అయితే గురువారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన ఈవో కృష్ణారావు, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్వామివారి సేవలన్నీ త్వరితగతిన పూర్తయ్యేలా చూశారు.

వీఐపీ దర్శనాన్ని కూడా కుదించి 8.30 గంటలకల్లా సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. దీనివల్ల సామాన్యులు దాదాపు గంటన్నరపాటు క్యాలైన్లలో పడిగాపులుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఇదేవిధంగా వారపు సేవలను త్వరగా ముగించి, ఆ సయమాన్ని సామాన్యులకు కేటాయిస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

Show comments