Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్నకు భారీ విరాళం

Webdunia
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళం అందంది. గురువారం చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త నళినీకృష్ణ స్వర్ణ కిరీటాన్ని కానుకగా అందజేశారు. 1.7 కేజీల బరువున్న ఈ కిరీటం సుమారు రూ. 27 లక్షల విలువ చేస్తుందని తితిదే అధికారులు తెలిపారు.

స్వామివారి ఉత్సవమూర్తులైన మలయప్పకు ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. స్వామివారి దేవేరులు, భూదేవీలకు కూడా స్వర్ణకిరీటాలు తయారు చేయించి త్వరలో తితిదేకు అందజేస్తానని నళినీకృష్ణ తెలిపారు.

మరోవైపు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు స్వర్ణ శంఖు, చక్రాలను విరాళంగా సమర్పించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన వెంకటకోనారావు రూ. 45లక్షల విలువ చేసే బంగారు శంఖు, చక్రాలను తితిదే అధికారులకు అందజేశారు.

2.7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ శంఖు చక్రాలకు వజ్రాలు కూడా పొదిగించారు. ఆలయ సన్నిధిలో కొలువైన మూలవర్లకు ఈ స్వర్ణ శంఖు చక్రాలను అలంకరిస్తారని తితిదే అధికారులు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Show comments