చిన్న పిల్లలకు దృష్టి దోషాలు తగులకుండా ఉండాలంటే శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకం చాలునని పండితులు అంటున్నారు. విబూదిని చేతితో పట్టుకొని, ఈ క్రింది మంత్రాలను పఠించి, దానిని పిల్లల నుదుటన, కంఠాన, వక్షస్థలమున, భుజాలపై రాస్తే ... దృష్టిదోషాలు తొలగి, సర్వ గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, శ్రీకృష్ణుని రక్షణ లభింపచేస్తాయి.
వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అంటూ ఈ మంత్రంతో పిల్లల దృష్టి దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.