Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ దోషాలు తొలగిపోవాలంటే.. మాంగాడు క్షేత్రాన్ని దర్శించుకోండి!

Webdunia
సోమవారం, 8 డిశెంబరు 2014 (19:25 IST)
వివాహ విషయంలో దోషాలు కలుగుతున్నాయా? అమ్మాయికి గానీ, అబ్బాయికీ కానీ వివాహంలో జాప్యం, అడ్డంకులు ఏర్పడుతున్నాయా? అయితే తమిళనాడులోని "మాంగాడు"క్షేత్రాన్ని దర్శించుకోండి అంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 
 
మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం తమిళనాడు - చెన్నై సమీపంలో విలసిల్లుతోంది. కామాక్షీదేవి (పార్వతీదేవి) కాంచీపురంలోని 'ఏకామ్రేశ్వరస్వామి'ని వివాహమాడటం కోసం ఇక్కడే తపస్సు చేసిందని స్థలపురాణం చెబుతోంది.
 
వివాహం విషయంలో అమ్మవారి కోరిక నెరవేరిన ప్రదేశం కావడం వలన, వివాహం విషయంలో ఆడపిల్లల మనసును అర్థంచేసుకునే అమ్మవారు మనస్సుకు నచ్చిన వారితో వివాహం జరిపించేలా అనుగ్రహిస్తారు. ఈ కారణంగానే వివాహ సంబంధమైన సమస్యలు ఎదుర్కుంటోన్న వాళ్లు, ఇక్కడ కొలువైన కామాక్షీ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
 
అమ్మవారిని దర్శించుకుని తమ ఆవేదనను చెప్పుకున్న యువతులకి అనతికాలంలోనే వివాహయోగం కలుగుతుందని అంటారు. అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందనడానికి నిదర్శనం, ఆ తల్లి ఆశీస్సుల కారణంగా వివాహమైనవారు తమ మొక్కులను చెల్లించుకోవడానికి పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉండటమేనని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments