పిడుగులు పడుతుంటే అర్జునా.. ఫల్గుణా అని ఎందుకంటారు?

Webdunia
గురువారం, 18 జులై 2019 (21:28 IST)
పిడుగులు పడినప్పుడు పెద్దలు అర్జునా, ఫల్గుణా అని అంటారు. దాని వెనుక ఉన్ని పరమార్దం ఏమిటి? ఈ విషయం వెనుక మహాభారత గాధ ఉంది. అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీవృక్షం దగ్గరకు తీసుకువస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన, కర్ణాదులను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుండి దించమంటాడు. 
 
ఉత్తర కుమారుడు భయపడుతుంటే... అది చూసి అర్జునుడు, తనకు ఉన్న పది పేర్లు(అర్జునా, ఫల్గుణా, పార్ధ, కిరీటీ, శ్వేతవాహన, బీభత్సు, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనుంజయ) చెప్పి , భయాన్ని పోగొడతాడు. అప్పటి నుండి ఎలాంటి భయం కలిగినా అర్జునా, ఫల్గుణా..... అని తలుచుకోవడం మొదలయ్యింది. అయితే యుద్ధంలో అర్జునుడి రధ చక్ర శూల విరిగిపడిందని, అదే పిడుగు అయ్యిందని నమ్మకం ఉండటంతో, పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments