Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి తిరునామం ఆయన కనులను సగం వరకూ మూసి వుంచుతుంది... ఎందుకు?

తిరుమల వేంకటేశ్వరస్వామివారు పద్మావతి అమ్మవారి కోరిక మేరకు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారని పురాణాలు మనకు చెబుతున్నాయి. గత జన్మలో వేదవతిగా జన్మించి, విష్ణువును వివాహమాడాలనే కోరికతో తపస్సు చేస్తున్న విష్ణువు జుట్టు పట్టుకుని పైకి లేపడానికి రావణుడు ప్ర

Webdunia
శనివారం, 21 జులై 2018 (20:32 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామివారు పద్మావతి అమ్మవారి కోరిక మేరకు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చారని పురాణాలు మనకు చెబుతున్నాయి. గత జన్మలో వేదవతిగా జన్మించి, విష్ణువును వివాహమాడాలనే కోరికతో తపస్సు చేస్తున్న విష్ణువు జుట్టు పట్టుకుని పైకి లేపడానికి రావణుడు ప్రయత్నించడంతో వెంటనే వేదవతి కళ్ళు తెరిచి తన వెంట్రుకలను అక్కడవరకు నరికి వేసింది. రావణాసురుడు చేసిన పనికి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన వేదవతి ఎవరైనా పరస్త్రీని అంగీకారం లేకుండా తాకితే మరణిస్తారని శపించింది రావణుడ్ని. 
 
రావణుడు తాకిన తన శరీరం అపవిత్రమైందని భావించిన వేదవతి అక్కడికక్కడే ఆహుతైంది. మరొక జన్మలోనైనా విష్ణువు భర్తగా లభించాలని కోరుకుంది. తరువాత జన్మలో ఆమె ఆకాశరాజు కుమార్తెగా జన్మించి శ్రీ వేంకటేశ్వరుడిని అందరి దేవతల సమక్షంలో వివాహమాడింది. వివాహం తరువాత తిరుమలలేశుడు తనను ప్రార్థిస్తున్న కోట్లాదిమంది భక్తుల కొరకు తాను తిరుమలలో వెలసి భక్తులను ఆశీర్వదిస్తూ వారిని కలి ప్రభావం నుంచి కాపాడుతానని మాటిచ్చారు. అందుకని తిరుమల బాలాజీ విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. 
 
అంతేకాకుండా ఆ విగ్రహ స్వరూపం సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపంగా కూడా భావిస్తారు. ఇక అసలు విషయంలోకి వెళదాం. వెంకటేశ్వరుని విగ్రహంపై ఉన్న భారీ తిరునామం ఆయన కళ్ళను మూసి ఉంచుతుంది. గోవిందుడిని దర్శించుకునే భక్తులు ఆయన కళ్ళను సగం మాత్రమే చూడగలగుతారు. మిగిలిన సగభాగం తిరునామం కిందే ఉంటుంది. స్వామివారి విగ్రహం పాదాల నుంచి పొంగి పొరలి జలప్రవాహాన్ని విరజానదిగా పిలుస్తారు. ఇది ఎక్కడ నుంచి ప్రవహిస్తుందో ఎవరికీ అంతుచిక్కలేదు. 
 
అంతేకాకుండా అప్పుడప్పుడు స్వామివారి విగ్రహం వేడి పొగలను కక్కుతూ కనిపిస్తుందట. వేంకటేశ్వరస్వామి ఎంత శక్తివంతుడో చెప్పడానికి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి కళ్ళ నుంచి శక్తివంతమైన కిరణాలు ప్రసరిస్తున్నాయని తెలుసుకున్న పండితులు ఎక్కువ రోజులు స్వామివారి కళ్ళను మూసి ఉంచే విధంగా తిరునామాన్ని పెద్దగా పెడతారు. గురువారం మాత్రమే స్వామివారిని దర్శించుకునే విధంగా చిన్నగా పెడతారు. అది తిరునామం వెనుక వున్న అసలు సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

తర్వాతి కథనం
Show comments