Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఆకుల్లో భోజనం చేయకూడదా...?

ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా తీపి తినాలి. పాలుపోసుకున్న తర్వాత పెరుగు పోసుకోకూడదని బ్రహ్మపురాణంలో ఉంది. కాళ్ళు బారచాపుకుని, ఎడమకాలి చేస్తో ముట్టుకుంటూ చెప్పులు వేసుకుని ఆహారం తినకూడదు.

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (21:49 IST)
ఆహారం తీసుకునేటప్పుడు ముందుగా తీపి తినాలి. పాలుపోసుకున్న తర్వాత పెరుగు పోసుకోకూడదని బ్రహ్మపురాణంలో ఉంది. కాళ్ళు బారచాపుకుని, ఎడమకాలి చేస్తో ముట్టుకుంటూ చెప్పులు వేసుకుని ఆహారం తినకూడదు. 
 
ఎడమచేత్తో తినడంగాని, తాగడం కాని పనికిరాదు. భోజనం చేయడం పూర్తయ్యాక అన్నీ తినకుండా కాస్త కాస్త విడిచిపెట్టాలి. అయితే పెరుగు, తేనె, నేయి, పాలు మాత్రం పూర్తిగా తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 
 
భాగ్యాన్ని కోరేవారు మఱ్ఱి, జిల్లేడు, రావి, కలిగొట్టు, తుమ్మికి, కానుగు ఆకులు వాడరాదని పైఠీనసివచనం. మోదుగ, తామర గృహస్థులకు పనికి రాదని, సన్యాసులకు పనికొస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 
 
అలాగే బంగారం, వెండి, కంచు పాత్రలతో పాటు తామరాకు, మోదుగాకులను భోజనపాత్రలుగా ఉపయోగించుకోవచ్చు. కంచుపాత్ర గృహస్తులకు మంచిది. భోజనం పాత్రలో వేసేటప్పుడు మొదట నేతిని చూపించాలి. ఆకులమీదగాని, ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చొని తినడం ఆచారం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments