Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి.. డిసెంబర్ 27న ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (13:53 IST)
జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగనుంది. సాధారణంగా సంక్రాంతి, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో ఆళ్వార్ తిరుమంజన సేవ జరుగుతుంది. 
 
అయితే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 27న ఆలయాన్ని శుద్ధి చేసే ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగబోతోంది. ప్రతిగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మూలవిరాట్టుకు పట్టువస్త్రం కప్పుతారు. గర్భగుడి, ఆనంద నిలయం, ధ్వజ స్తంభం, యోగ నరసింహ స్వామి, వకుళమాత వంటి పుణ్యక్షేత్రాలు, సంపంగి మండపం, రంగనాథ మండపాలతో పాటు ఆలయ శుద్ధి చేస్తారు. ఆ తర్వాత పచ్చకర్పూరం, పసుపు వంటి వివిధ మూలికా పదార్థాలతో తయారు చేసిన మిశ్రమాన్ని ఆలయం అంతటా చల్లడం చేస్తారు. 
 
ఆలయంలో ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా దర్శనానికి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల తర్వాత యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు. దీంతో 5 గంటల పాటు దర్శనం నిలిచిపోనుంది. కాగా గురువారం 63,145 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 22,411 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

తర్వాతి కథనం
Show comments