Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి 12 గంటలకు శ్మశానం నుంచి భస్మం... శివునికి భస్మాభిషేకం...

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (21:01 IST)
జ్యోతిర్లింగ పీఠాలలో ఎన్నో ప్రత్యేకతలు కలిగి వున్న క్షేత్రం ఉజ్జయినీ క్షేత్రం. శ్రీశైలం లాగానే జ్యోతిర్లింగం, శక్తి పీఠం రెండూ కలిగి అపురూప క్షేత్రం ఉజ్జయిని. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్ నుండి 188 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. దక్షిణ ముఖంగా స్వామి వెలిసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. జ్యోతిర్లింగ అలయాలలో దక్షిణ ముఖంగా స్వామి వెలసిన ఆలయమిదొక్కటే. 
 
మరో ప్రత్యేకత వింటే ఒడలు జలదరిస్తుంది. ఆలయం సమీపంలోనే ఉండే స్మశానం నుండి ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు చితాభస్మం సేకరించి తెచ్చి దానితో భస్మాభిషేకం నిర్వహిస్తారు. భస్మాభిషేకం తెల్లవారు జామున 4 గంటలకు నిర్వహిస్తారు. దాదాపు రెండు గంటలపాటు ఈ భస్మాభిషేకం కొనసాగుతుంది. 
 
ఒక అఘోరా ఈ చితాభస్మాన్ని స్మశానం నుండి తీసుకొచ్చి, ఈ భస్మాభిషేకంలో పాల్గొంటాడు. మహాకాళేశ్వర లింగాన్ని ప్రతివారూ తాకి పూజించవచ్చు. మహాకాళేశ్వర అర్చనలో వాడిన బిల్వపత్రాలు, పూవులు మిగతా ఆలయాలలో మాదిరి పారేయకుండా శుభ్రపరిచి మరలా వాడటం ఇక్కడి మరో ప్రత్యేకత.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments