సర్వదర్శనం టిక్కెట్ల జారీ... రోజుకు 2 వేల టోకెన్లు.. క్యూ కట్టిన భక్తులు

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:02 IST)
తిరుమలలో ఐదు నెలల తర్వాత ఉచిత దర్శనాలు ప్రారంభమయ్యాయి. తాజాగా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే బుధవారం చిత్తూరు జిల్లావాసులకే టోకెన్లను పరిమితం చేశారు.
 
అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 2 వేల టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చిత్తూరు జిల్లా భక్తులు పోటీపడుతున్నారు. 
 
కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది.
 
ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఒక కౌంటర్‌లో మాత్రమే టిక్కెట్లను జారీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక భక్తులకు మాత్రమే సర్వదర్శన టిక్కెట్లను జారీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వరితం 2026 శీర్షికన తమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న ముజిగల్ మల్కాజ్‌గిరి అకాడమీ

సీఎం విజయ్ బాటలో సూర్య రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా వుంటుంది?

హైదరాబాదులో వర్షాలు.. పెరుగుతున్న అనారోగ్య సమస్యలు.. జాగ్రత్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments